Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తు ఉండదు... తెగదెంపులే : సంకేతాలిచ్చిన చంద్రబాబు

భారతీయ జనతా పార్టీతో ఇక సయోధ్య ఉండదని, తెగదెంపులే ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు.

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (09:34 IST)
భారతీయ జనతా పార్టీతో ఇక సయోధ్య ఉండదని, తెగదెంపులే ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. 
 
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బుధవారం టీ టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఇందులో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు టీ టీడీపీ అధ్యక్ష పదవిని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని, తమతో చెప్పకుండా బీజేపీతో పొత్తుపెట్టుకోరాదంటూ నినాదాలు చేశారు. 
 
దీంత చంద్రబాబు స్వయంగా వారిని శాంతపరిచారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలియకుండా ఏమి చేయనని స్పష్టంచేశారు. అదేసమయంలో బీజేపీతో పొత్తు ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తులపై నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. 
 
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments