Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య మజ్నులో రెజీనా: అయేషా శర్మను తప్పించి రెజీనాకు ఛాన్స్!

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2015 (13:46 IST)
నాగచైతన్య మజ్ను ''ప్రేమమ్'' రీమేక్‌లో హీరోయిన్ల వేట ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా ప్రేమమ్ రీమేక్‌లో నటించే అవకాశాన్ని రెజీనా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో రెజీనా ఈ ఛాన్సును సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు చందు మొండేటి 'ప్రేమమ్' రీమేక్‌ను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో స్టోరీపరంగా ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు అవసరం. ముందుగా శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, అయేషా శర్మను ఎంపిక చేశారు. అయితే అయేషా శర్మ విషయంలో చందు మొండేటి మనసు మార్చుకున్నాడని తెలిసింది. 
 
ఆమెకు బదులుగా రెజీనా అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను చివరి నిమిషంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడట. ఇప్పటికే ఈ సినిమా ద్వారా అనుపమ పరమేశ్వరన్ ఒక కథానాయికగా పరిచయమవుతోంది. మళ్లీ మరో కొత్త కథానాయికగా అయేషా శర్మను పరిచయం చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఆమెను తప్పించినట్లు.. రెజీనాను తీసుకున్నట్లు సమాచారం. ఎనీవే.. రెజీనాకు మంచి ఛాన్సే దక్కిందని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments