Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు-2లో మహానటి కాంబో..? మళ్లీ స్క్రీన్‌పై సమంత, కీర్తి సురేష్?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (11:04 IST)
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ''మన్మథుడు 2''. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
త్వరలో పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహానటి నటించనుందని టాక్. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తుందన్నది తాజా సమాచారం.
 
ఇకపోతే.. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం నటించడం లేదట. మన్మథుడు చిత్రానికి బ్రహ్మానందం కామెడీ ఎంత ప్లస్సో అందరికీ తెలిసిందే. అలాంటిది ‘మన్మథుడు 2’ చిత్రంలో బ్రహ్మానందం లేడనే విషయం సినీ ప్రేమికులను నిరాశపరచడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
కానీ బ్రహ్మానందం స్థానంలో ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటించనున్నాడట. కానీ మన్మథుడు-2లో బ్రహ్మీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments