Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు-2లో మహానటి కాంబో..? మళ్లీ స్క్రీన్‌పై సమంత, కీర్తి సురేష్?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (11:04 IST)
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ''మన్మథుడు 2''. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
త్వరలో పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహానటి నటించనుందని టాక్. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తుందన్నది తాజా సమాచారం.
 
ఇకపోతే.. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం నటించడం లేదట. మన్మథుడు చిత్రానికి బ్రహ్మానందం కామెడీ ఎంత ప్లస్సో అందరికీ తెలిసిందే. అలాంటిది ‘మన్మథుడు 2’ చిత్రంలో బ్రహ్మానందం లేడనే విషయం సినీ ప్రేమికులను నిరాశపరచడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
కానీ బ్రహ్మానందం స్థానంలో ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటించనున్నాడట. కానీ మన్మథుడు-2లో బ్రహ్మీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments