Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్‌పై మరో వివాదం.. ట్రైలర్‌ను అలా విడుదల చేశారట!

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (17:18 IST)
ఆదిపురుష్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ మూవీ సంక్రాతికి రిలీజ్ కావాల్సింది. కానీ.. ట్రైలర్‌పై వచ్చిన ట్రోల్స్, విమర్శలతో పునరాలోచనలో  చిత్ర బృందం పడింది. ఆపై విడుదలను వాయిదా వేసుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సెన్సార్ బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే గత ఏడాది ట్రైలర్‌ని విడుదల చేసిందట. 
 
ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టులో తాజాగా తివారి అనే వ్యక్తి పిల్ వేశారు. దాంతో విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకి నోటీసులిచ్చింది. సెన్సార్ బోర్డు నుంచి ఆదిపురుష్ ట్రైలర్ అనుమతి తీసుకోలేదని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తివారి చెప్పారు. 
 
ఇంకా చర్యలు తీసుకోవాల్సిందేనని అలహాబాద్ హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు  విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. 
 
ఇకపోతే..ప్రభాస్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా ఆది పురుష్ తెరకెక్కుతోంది.  ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments