Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్‌పై మరో వివాదం.. ట్రైలర్‌ను అలా విడుదల చేశారట!

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (17:18 IST)
ఆదిపురుష్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ మూవీ సంక్రాతికి రిలీజ్ కావాల్సింది. కానీ.. ట్రైలర్‌పై వచ్చిన ట్రోల్స్, విమర్శలతో పునరాలోచనలో  చిత్ర బృందం పడింది. ఆపై విడుదలను వాయిదా వేసుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సెన్సార్ బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే గత ఏడాది ట్రైలర్‌ని విడుదల చేసిందట. 
 
ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టులో తాజాగా తివారి అనే వ్యక్తి పిల్ వేశారు. దాంతో విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకి నోటీసులిచ్చింది. సెన్సార్ బోర్డు నుంచి ఆదిపురుష్ ట్రైలర్ అనుమతి తీసుకోలేదని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తివారి చెప్పారు. 
 
ఇంకా చర్యలు తీసుకోవాల్సిందేనని అలహాబాద్ హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు  విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. 
 
ఇకపోతే..ప్రభాస్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా ఆది పురుష్ తెరకెక్కుతోంది.  ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments