Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవి శేష్ నటిస్తున్న జి 2 అప్ డేట్ గుజరాత్‌లో ప్రారంభం

డీవీ
శనివారం, 30 మార్చి 2024 (11:04 IST)
Banitasandhu
ఇటీవలే తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి జి 2  సినిమా ప్రమోషన్ లో కొత్త ప్రచారాన్ని నెలకొల్పిన అడవి శేష్ నేడు హీరోయిన్ బనితాసంధు ఫొటో పెట్టి షూటింగ్ ప్రారంభం అంటూ క్లారిటీ ఇచ్చాడు.  కొత్త షెడ్యూల్ గుజరాత్‌లోని భుజ్‌లో ప్రారంభమయింది. అడివిశేష్, బనితాసంధు ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. హీరోయిన్ బనితాసంధు సెల్ఫీని తీసుకుని పోస్ట్ చేసింది. ఈ లొకేషన్ లో గతంలో మగధీర సినిమాలో ఓ సీన్ తీశారు.
 
2018లో ఆడియన్స్ ముందుకు వచ్చి థ్రిల్ చేసిన స్పై యాక్షన్ మూవీ ‘గూఢచారి’. శశి కిరణ్ టిక్క డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ ఇవ్వడం విశేషం. అప్పటినుంచి ఈ సినిమాకు ఫ్రాంచైస్ గా ఉంటే బాగుండు అనే భావన చిత్ర టీమ్ కు కలిగింది. దానివల్ల రెండో పార్ట్ వస్తుంది. 
 
గత ఏడాది ఈ సినిమాకు సంబందించి ఓ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఇందులో అడవి శేష్ జేమ్స్ బాండ్ తరహాలో లుక్ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. ఇప్పటికీ మరలా ఈ సినిమా ఆరంభం అని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బనితా సంధు హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ‘మేజర్’ సినిమాకి ఎడిటర్ గా పని చేసిన వినయ్ కుమార్ ఈ  సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments