Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోలిద్దరు మోసం చేశారట.. ఎవరా ఇద్దరు? ఆదా శర్మ ఏమంటోంది?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (12:44 IST)
మెగా హీరోలిద్దరు తనను మోసం చేశారని ఆదా శర్మ అంటోంది. బాలీవుడ్ 1920 సినిమాలో అద్భుత నటన ఆకట్టుకున్న ఆదా శర్మ, టాలీవుడ్‌లో పూరీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న హార్ట్ ఎటాక్ ద్వారా సినీ ప్రేక్షకులను పలకరించింది. అయితే హార్ట్ ఎటాక్ తర్వాత ఆశించిన ఆఫర్లు రాకపోయాయి. సన్నాఫ్ సత్యమూర్తిలోనూ అల్లు అరవింద్‌తోనూ కొన్ని సీన్స్‌కు పరిమితం కావడంపై ఆదా శర్మ మెగా హీరోస్‌దే పాపమంటూ వాపోయింది.   
 
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కేవలం చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న ఆదా శర్మ తాజాగా రిలీజై సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా ఫ్యాన్స్‌ని నిరాశ పరించింది. అల్లు అర్జున్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా తనను మోసం చేశారని ఆదా శర్మ చెప్తుంది. నిజానికి సుబ్రమణ్యం పర్ సినిమాలో సాయితో కొన్ని సీన్లు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని ఒప్పించారట. కాని సినిమా లెంథ్ ఎక్కువ అవ్వడంతో ఆ సీన్లు కట్ చేశారని అంటుంది. 
 
దీంతో ఇక ఇలాంటి రోల్స్ చేయకూడదని డిసైడైపోయింది. ప్రస్తుతం ఆదితో గరం సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్రమణ్యం ఫర్ సేల్ విషయంలో మెగా హీరోల మీద మండిపడిందే కారణమని దర్శక నిర్మాతలే అలా చేశారని అమ్మడికి తెలిస్తే బెటర్. అనవసరంగా మెగా ఫ్యాన్స్ కోపానికి గురైతే అమ్మడికి రావాల్సిన సినిమా ఛాన్సెస్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉందని సినీ పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments