Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంట

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:22 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంటనే కదా మీ సందేహం. 
 
ఆర్జీవీ తెరకెక్కించనున్న 'లక్షీస్ ఎన్టీఆర్' సినిమాపై ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం చెలరేగింది. ఇప్పటివరకు వర్మపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా... తాజాగా, టీడీపీలో చేరుతానని ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ కూడా ఆ జాబితాలో చేరారు. 
 
ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే, చూస్తూ ఊరుకోబోమని... ఇలాంటి సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలని అన్నారు. లేనిపక్షంలో వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్‌లో రాముడిని, కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారని అన్నారు.
 
ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని వాణీ విశ్వనాథ్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments