బాలీవుడ్ నటి రేఖ ఇంటికి సీలు వేసిన ముంబై మున్సిపల్ అధికారు.. కారణం?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (09:37 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా, ముంబై మహానగరంలో ఈ వైరస్ వ్యాప్తి విశ్వరూపం దాల్చింది. ఫలితంగా ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ఇంటివద్ద పని చేసే ఓ సెక్యూరిటీ గార్డుకు ఈ వైరస్ సోకింది. దీంతో రేఖ నివసించే బంగళాకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. 
 
రేఖ ఇంటి ముందు తలుపుకు కూడా మున్సిపల్ అధికారులు ఓ బ్యానర్ కట్టి... కంటైన్మెంట్ జోనుగా ప్రటించారు. అలాగే, ఈ ఇంటి రేఖ కూడా తన మకాం మార్చారు. ముంబై, బంద్రాలోని బన్‌స్టాండ్ ఏరియాలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు. రేఖ నివసించే ఇంటితో పాటు.. సెక్యూరిటీ గార్డు నివసించిన ఇంటిని మున్సిపల్ అధికారులు శానిటైజ్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రేఖ వ్యక్తిగత ప్రతినిధి వైపు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments