Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి రేఖ ఇంటికి సీలు వేసిన ముంబై మున్సిపల్ అధికారు.. కారణం?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (09:37 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా, ముంబై మహానగరంలో ఈ వైరస్ వ్యాప్తి విశ్వరూపం దాల్చింది. ఫలితంగా ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ఇంటివద్ద పని చేసే ఓ సెక్యూరిటీ గార్డుకు ఈ వైరస్ సోకింది. దీంతో రేఖ నివసించే బంగళాకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. 
 
రేఖ ఇంటి ముందు తలుపుకు కూడా మున్సిపల్ అధికారులు ఓ బ్యానర్ కట్టి... కంటైన్మెంట్ జోనుగా ప్రటించారు. అలాగే, ఈ ఇంటి రేఖ కూడా తన మకాం మార్చారు. ముంబై, బంద్రాలోని బన్‌స్టాండ్ ఏరియాలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు. రేఖ నివసించే ఇంటితో పాటు.. సెక్యూరిటీ గార్డు నివసించిన ఇంటిని మున్సిపల్ అధికారులు శానిటైజ్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రేఖ వ్యక్తిగత ప్రతినిధి వైపు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments