Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండేకు చిక్కులు.. లాక్‌డౌన్ ఉల్లంఘించి స్నేహితుడితో చక్కర్లు

Webdunia
సోమవారం, 11 మే 2020 (11:11 IST)
బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి తన స్నేహితుడితో కలిసి ముంబై రోడ్లపై కారులో చక్కర్లు కొట్టినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ నటి పూనమ్ తన మిత్రుడైన సినీ దర్శకుడు అహ్మద్ బాంబేతో కలిసి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బీఎండబ్ల్యూ కారులో బంద్రా నుంచి మెరైన్ డ్రైవ్‌కు బయలుదేరారు.
 
వీరి కారును ఆపిన మెరైన్ డ్రైవ్ ప్రాంత పోలీసులు, బయటకు వచ్చిన కారణాన్ని అడుగగా, సరైన సమాధానం చెప్పక పోవడంతో, ఇద్దరినీ అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని వదిలేశారు. ఈ విషయాన్ని జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ వెల్లడించారు. పైగా, లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినందుకుగాను వారిద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 188, 269 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments