Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ.. కారణం ఏమిటంటే?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:13 IST)
Meera Chopra
సినీ నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరా చోప్రా సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల సోషల్ మీడియాలో చిట్‌చాట్‌లో పాల్గొన్న మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్‌బాబు అంటే ఇష్టమని పేర్కొన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ గురించి తెలియదన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ట్విట్టర్ వేదికగా ఆమెను దుమ్మెత్తిపోయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
దీంతో స్పందించిన నటి ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా ''67ఎ''ను కూడా జతచేసిన పోలీసులు... మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments