Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ.. కారణం ఏమిటంటే?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:13 IST)
Meera Chopra
సినీ నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరా చోప్రా సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల సోషల్ మీడియాలో చిట్‌చాట్‌లో పాల్గొన్న మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్‌బాబు అంటే ఇష్టమని పేర్కొన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ గురించి తెలియదన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ట్విట్టర్ వేదికగా ఆమెను దుమ్మెత్తిపోయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
దీంతో స్పందించిన నటి ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా ''67ఎ''ను కూడా జతచేసిన పోలీసులు... మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments