Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్- యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోనా పాజిటివ్..

Webdunia
సోమవారం, 20 జులై 2020 (16:00 IST)
Aishwarya Arjun
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ప్రముఖ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ మెసేజ్‌ను పొందుపరిచారు.
 
గడిచిన కొద్ది రోజుల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఐశ్వర్య సూచించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని.. మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానన్నారు. 
 
ఇటీవలే కన్నడ సినీ పరిశ్రమలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో అర్జున్ మేనల్లుడు, దివంగత నటుడు చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అదే ఫ్యామిలీ నుంచి అర్జున్ కుమార్తె కరోనా బారిన పడ్డారు. ఆమె త్వరలో కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments