Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసులో ఇరుక్కున్న మెర్సల్ హీరో తండ్రి.. తిరుపతి హుండీ కానుకలన్నీ లంచాలే..

తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్టేనని నటుడు విజమ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రశేఖర్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. గత నవంబరు న

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (14:10 IST)
తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్టేనని నటుడు విజమ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రశేఖర్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. గత నవంబరు నెలలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ చేసిన వీడియో బయటకు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఆలయ హుండీల్లో కానుకలు వేస్తే పరిక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇక పరిక్షలే రాయవలసిన అవసరం లేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హిందు మున్నని సంఘం మండిపడింది. చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరచేవిగా వున్నాయని చెన్నై పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయంలో హిందు మున్నని సంఘం గత నెల 25వ తేదీన ఫిర్యాదు చేశారు. 
 
అయితే ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌లో దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్‌పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి ఎంఎస్‌.రమేశ్‌ సమక్షంలో విచారణకు రాగా తగిన ఆధారాలుంటే దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments