Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-క్లబ్ గుట్టువీడేనా : నేడు ఈడీ ముందుకు నవదీప్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:32 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విచారణలో భాగంగా, సోమవారం నటుడు నవదీప్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. 
 
మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించింది.
 
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానాను ఈడీ విచారణకు హాజరయ్యాడు. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా విచారణ విచారించనున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఇప్పటివరకు హీరో రవితేజ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీతి సింగ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరైయ్యారు. ఎఫ్ కేఫ్ కేంద్రంగా సినీస్టార్స్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments