Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహర్షి రాఘవ... రికార్డ్ బ్రేక్... వందసార్లు రక్తదానం.. చిరు సత్కారం!!

వరుణ్
గురువారం, 18 ఏప్రియల్ 2024 (11:31 IST)
సినీ నటుడు మహర్షి రాఘవ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా వంద సార్లు రక్తదానం చేశారు. హైదరాబాద్ నగరంలోని చిరంజీవి రక్తదాన కేంద్రంలో ఆయన తాజాగా వందోసారి రక్తదానం చేశారు. ఆయనను మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. 1998 అక్టోబరు రెండో తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రారంభమైంది. తొలుత రక్తం ఇచ్చిన వ్యక్తి సినీ నటుడు మురళీమోహన్. రెండో వ్యక్తి మహర్షి రాఘవ. అప్పటి నుంచి మహర్షి రాఘవ క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన వందో సారి ఇచ్చి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. మహర్షి రాఘవ దంపతులతో పాటు మురళీమోహన్‌ను తన నివాసానికి పిలిపించి చిరు సత్కారం చేశారు. మహర్షి రాఘవకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వందసార్లు రక్తదానం చేయడం చాలా అరుదైన గొప్ప విషయంగా చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ రావడం మామూలు విషయం కాదంటూ రాఘవ సేవాగుణాన్ని చిరంజీవి కొనియాడారు. అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆయన సూచించారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments