Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాతో లింకు పెట్టారు.. ఎంజాయ్ చేశాను.. ఊపిరి హీరో కార్తీ

హీరో కార్తీ ఆవారా ద్వారా ఎంటరై ఊపిరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖాఖీ సినిమాలో నటించిన కార్తీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (17:34 IST)
హీరో కార్తీ ఆవారా ద్వారా ఎంటరై ఊపిరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖాఖీ సినిమాలో నటించిన కార్తీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన లవ్ సీన్స్ చూసినప్పుడు.. లవ్ సీన్స్‌లో టచ్ చేయకుండా యాక్ట్ చేయడం కష్టమా అని తన భార్య అడుగుతుంటుందని కార్తీ చెప్పారు.
 
పెర్ఫార్మెన్స్ పరంగా తాను కొంచెం ఎక్స్‌ట్రా అని.. ప్రేమ, పెళ్లి వంటి సీన్స్‌లో పూర్తిగా ఇన్వాల్స్ కాకపోతే, ఆ సన్నివేశాలు కృత్రిమంగా అనిపిస్తాయని చెప్పేవాడినని కార్తీ తెలిపారు. ఆడియన్స్‌కు ఆ ఫీల్ కలిగేలా నటించవలసి వుంటుంది. ఆ విషయంలో తన భార్యకు జెలసీ సహజమని.. ఈ విషయంలో తనకు ఆమెకు గొడవలు జరుగుతూనే వుంటాయని.. అందుకే తన సినిమాలు చూడొద్దనే తానే ఆమెకు చెప్తూ వుంటానని కార్తీ తెలిపారు. 
 
తమన్నాతో లింకుపెట్టినప్పుడు ఎంజాయ్ చేసే దాన్నని.. లవ్ స్టోరీలు, మళ్లీ మళ్లీ ఒకే హీరోయిన్‌తో చేయడంతో తమన్నాతో లింకుపెట్టారని మీడియాకు ఆ విషయం దొరికిందని కార్తీ వెల్లడించారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ తనకు ప్రపోజ్ చేయలేదన్నారు. తమన్నాతో లింక్ చేస్తూ స్పైసీ న్యూస్ కోసం కొంతమంది ఇలాంటివి సృష్టించారని.. ఒక రకంగా ఇలాంటి వార్తలను అప్పట్లో ఎంజాయ్ చేశానని చెప్పారు. 
 
కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా తన వైపు చూడలేదని.. హీరో అయ్యాక లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు కాలేజీ అమ్మాయిలు తనను పెళ్లి చేసుకోమని వెంటపడ్డారని కార్తీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments