Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ విక్రయిస్తున్న కన్నడ నటుడు కిషోర్ అమన్ శెట్టి అరెస్టు

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (09:44 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో సహా మరికొందరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నందుకుగాను కన్నడ నటుడు, కొరియోగ్రాఫర్ అయిన కిషోర్ అమన్ శెట్టిని మంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. అమన్ శెట్టి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కార్యక్రమంతో మంచి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏబీసీడీ.. ఎనీ బడీ కెన్ డ్యాస్ చిత్రంలో కూడా నటించాడు. 
 
ఈ విషయాన్ని వెల్లడించిన మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ వికాశ్ కుమార్, వీరిద్దరూ మాదకద్రవ్యమైన 'ఎండీఎంఏ'ను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్స్ సంపాదించిన తర్వాత, బైక్‌పై వెళుతూ పట్టుబడ్డారని, రెండో వ్యక్తిని అఖీల్ నౌషీల్‌గా గుర్తించామని తెలిపారు.
 
వీరికి డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని, ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్) చట్టం కింద వీరిపై కేసును రిజిస్టర్ చేశామని తెలిపారు. కాగా, ఇదే కేసులో మరో ఇద్దరు విదేశీయులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments