Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత సమాధికి హీరో అజిత్ నివాళులు... భార్య షాలినితో..

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి వద్ద తమిళ హీరో అజిత్ నివాళులు అర్పించారు. ఆయన బుధవారం తెల్లవారుజామున మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు తన భార్య షాలినితో వచ్చి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళు

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (13:00 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి వద్ద తమిళ హీరో అజిత్ నివాళులు అర్పించారు. ఆయన బుధవారం తెల్లవారుజామున మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు తన భార్య షాలినితో వచ్చి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలంటూ దైవాన్ని ప్రార్థించారు. 
 
కాగా, ముఖ్యమంత్రి జయలలిత అంటే అజిత్‌కు ప్రత్యేకమైన అభిమానం. జయలలితను అజిత్ కన్నతల్లిగా భావిస్తూ వచ్చారు. అలాగే, అజిత్ అంటే జయలలితకు కూడా ప్రత్యేకమైన అభిమానం. దీనికి నిదర్శనంగా పలుమార్లు అజిత్‌ను పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి జయలలిత పిలిపించి మాట్లాడారు కూడా. అప్పటి నుంచి జయలలిత రాజకీయ వారసుడు అజిత్ అంటూ విస్తృతమైన ప్రచారం కూడా ఉంది. 
 
ఈనేపథ్యంలో జయలలిత చనిపోయిన సమయంలో అజిత్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బల్గేరియా దేశంలో ఉన్నాడు. అమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే అజిత్ షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకు బయలుదేరారు. అయినప్పటికీ తల్లిలాంటి అమ్మను కడసారి చూడలేక పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments