మన దేశ చరిత్ర, సంస్క్రుతిని కాపాడాలనే క్రుతనిశ్చయంతో నెలకొల్పబడిన సంస్కారభారతి తాజాగా సినిమా కథలలో కూడా అందుకు తోడ్పడేలా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకోవాలని కోరింది. శనివారంనాడు హైదరాబాద్ మణికొండలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫిల్మ్ రివ్యూ జర్నలిస్టుల సమావేశంలో సంస్కారభారతి అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ అభిజిత్ గోకలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించారు. గతంలో పలు రంగాలలో తాము చేస్తున్న సేవలను ఉదహరించారు.
ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి ఆదిపురుష్ లో రామాయణాన్ని వక్రీకరించి ఇదే అసలు కథగా భావి తరాలకు నిర్దేశంగా మారే ప్రమాదంగా వుందని కనుక సంస్కారభారతి తరఫున మీరేం చేశారని వెబ్ దునియా అడిగిన ప్రశ్నకు గోఖలే స్పందించారు. రామాయణం అనేది వాల్మీకి రచించిన గ్రంథాన్ని పలు రూపాల్లో పలువురు కథలుగా చెబుతున్నారు. కానీ ఆదిపరుష్ లో గ్రాఫిక్స్ ఎక్కువ కావడంతో కథలో పట్టు తగ్గి కార్టూన్ సినిమా మారిందనీ, దీనిపై అయోధ్యతో సహా పలుచోట్ల దర్శక నిర్మాతలతో చర్చలు జరిగాయని తెలిపారు.
Meet and greet with film review journalists
ప్రధానంగా సినిమాలు ఏ కోణంలో తీస్తున్నారో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేది సమీక్షలు రాయాల్సిన అవసరం వుందని సూచించారు. సెన్సార్ విషయంలో కూడా కొన్ని సవరణలు అవసరం తేల్చిచెప్పారు. అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్ వుండాలనేది తమ వాదనని తెలియజేస్తూ, ఈ విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళతామని తెలిపారు.