Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో విలేకరి విడాకుల ప్రశ్న, బుద్ధీ బుర్రా వుందా అంటూ సమంత ఆగ్రహం

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:02 IST)
అసలే స్టార్ హీరోయిన్. ఆపై ఈమధ్య విడాకులు అంటూ ఒకటే చర్చ. దీనితో సమంత, నాగచైతన్యలు ఎక్కడైనా కనబడతారా అంటూ ఎదురుచూసేవారు ఎక్కువయ్యారు. ఎందుకంటే.... అసలు విడాకులు అంటూ మీడియా కోడై కూస్తున్నా అటు సమంత కానీ ఇటు చైతన్య కానీ మౌనం వహిస్తున్నారు. దీనితో అక్కినేని ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... సమంత అక్కినేని మనశ్శాంతి కోసం శనివారం వేకువ జామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె వచ్చిందని తెలియగానే స్థానిక జర్నలిస్టులు చుట్టుముట్టారు. కొందరు మాస్కు తీయండి మేడం అని అడిగితే... మరికొందరు విడాకులపై ప్రశ్న సంధించేందుకు ప్రయత్నించారు. ఒక విలేకరి ఆమెకి వినబడేట్లు.. విడాకులు అనుకుంటున్నారు దీనిపై ఏం చెప్తారు మేడం అనేసరికి సమంత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యింది. 
 
గుడికి వచ్చాను. ఇలాంటివి అడిగేందుకు నీకు బుద్ధుందా... అనడమే కాకుండా నీకు బుర్ర లేదంటూ తలపై చేయి పెట్టి సైగ చేస్తూ వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దీనితో అక్కడి వారంతా అలాగే గుడ్లప్పగించి చూస్తూ వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

Mother: బాయ్‌ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?

హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments