Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వెండితెరపై మరో బయోపిక్ - ధృవీకరించిన కోన వెంకట్

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (13:44 IST)
తెలుగు వెండితెరపై మరో బయోపిక్ ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ ధృవీకరించారు. భారత మల్లయోధురాలు, ఒలింపిక్స్ పతక విజేత కరణం మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మల్లీశ్వరి పుట్టిన రోజైన జూన్ ఒకటో తేదీని పురస్కరించుకుని కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
జూలై ఒకటో తేదీ సోమవారం కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు కాగా, మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రమని ఆయన స్పష్టం చేశారు. 
 
సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు.  ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
 
కాగా, భారతదేశం తరపున ఒలింపిక్స్ పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2000 ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన సంగతి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments