Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభకోణంలో ఘోర ప్రమాదం: ప్రభుదేవా కొత్తప్రాజెక్టు సభ్యులు ఇద్దరు మృతి

కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ''యంగ్ మంగ్ చంగ్'' అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకో

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:29 IST)
కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ''యంగ్ మంగ్ చంగ్'' అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, తంగర్‌బచ్చన్, లక్ష్మీమీనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజుల పాటు ఈ సినిమా గ్రూప్ తిరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం తిరువైయారులోని అయ్యారప్పర్ ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు గానూ యూనిట్ సభ్యులంతా బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని వ్యానులో తిరువైయారుకు బయల్దేరారు. అయితే కుంభకోణం-తిరువైయార్ రోడ్డు.. కరుప్పురు గ్రామం, కబిస్థలం సమీపంలో వ్యానును భారీ లోడ్‌తో వచ్చిన లారీ వేగంతో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యూనిట్ సభ్యులు మరణించారు. 
 
విజయ్ కుమార్ (43), డ్రైవర్ ఆరుముగం (53) తీవ్రగాయాలతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకా గాయపడిన సభ్యులను తంజావూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కబిస్థలం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇకపోతే.. ఈ విషయం తెలియగానే బాధితులను తంజావూర్ మెడికల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు ప్రభుదేవా. ఈ దుర్ఘటన ప్రభుదేవా టీమ్‌ని తీవ్రంగా కలిచివేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments