Webdunia - Bharat's app for daily news and videos

Install App

'2.O' మూవీకి షాక్... తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో పైరసీ

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (17:02 IST)
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "2పాయింట్ఓ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తేరుకోలేని షాక్ తగిలింది.
 
ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీభూతం వెంటాడింది. తమిళ రాకర్స్ అనే వెబ్‌సైట్లో ఈ చిత్రం పైరసీ వీడియో అందుబాటులోకి వచ్చింది. ఈ హఠాత్పరిణామంపై చిత్ర నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు తీవ్రఆందోళన చెందుతున్నారు. సదరు వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.
 
సుమారుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే, బయ్యర్లు కూడా భారీ మొత్తం వెచ్చించి చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ చిత్రం ఓపెనింగ్స్‌పరంగా మంచి కలెక్షన్లు వస్తాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. గత చిత్రాల రికార్డులన్నీ ఈ మూవీ తిరగరాస్తొందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 
 
ఇంతలోనే ఈ చిత్రం పైరసీ తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రావడం ఇపుడు నిర్మాతలతో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అదీ కూడా హెచ్‌డీ రిజల్యూషన్‌లో దర్శనమివ్వడం ఇపుడు ఆందోళన కలిగించే అందంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments