Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మగధీర'కు ఓ పుష్కరం : బయ్యర్లకు లాభాల పంట పండించిన మూవీ

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:14 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'మగధీర'. ఈ చిత్రం విడుదలై నేటికి 12 సంవత్సరాలు ఈ చిత్రం గత 2009 జూలై 31వ తేదీన విడుదలైంది. 
 
రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానరుపై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు అని చాలా మంది విమర్శించినా కూడా.. అనుకున్నది చేసి చూపించారు రాజమౌళి. బాక్సాఫీసు వ‌ద్ద‌ రూ80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా చేసింది. 
 
చిరుతతో బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన రాం చరణ్ రెండో ప్రయత్నంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన చిత్రంగా మగధీర మిగిలిపోయింది.  పైగా, మెగాస్టార్ చిరంజీవిగా చెర్రీ గుర్తింపుపొందారు. అప్పటివరకు తెలుగు సినిమా కలలో కూడా చూడని కలెక్షన్లు మనకు పరిచయం చేసింది ఈ చిత్రం. పునర్జన్మ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. 
 
మగధీర చిత్రానికి కేవలం 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇన్ని కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానాలకు తెరదించుతూ.. 77.96 కోట్ల షేర్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రం బయ్యర్లకు 37.54 కోట్ల భారీ లాభాలు దక్కాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments