పవన్ కల్యాణ్‌తో చిందులేయనున్న రంగమ్మత్త..

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (17:28 IST)
2018 నాటి బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ జాతకమే మారిపోయింది. రంగస్థలం తరువాత ఎఫ్ 2 వంటి మల్టిస్టారర్ మూవీలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడితో పాటు రంగమార్తండ, వేదాంతం రాఘవయ్య సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితోనూ ఓ తమిళ చిత్రం చేయబోతోంది.
 
ఇదిలా ఉంటే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం అనసూయకు దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న పిరియడ్ డ్రామాలో ఒకట్రెండు సన్నివేశాలతో కూడిన ఓ ప్రత్యేక గీతంలో అనసూయ దర్శనమివ్వనుందట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ పాట.. సదరు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే పవన్ - క్రిష్ కాంబో మూవీలో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
 
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోనే అనసూయ ఇట్స్ టైమ్ టు ద పార్టీ సాంగ్ చేయాల్సింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం వదులుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత పవన్‌తో నర్తించే అవకాశం దక్కడం వార్తల్లో నిలిచే అంశమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ ఏపీకి దీర్ఘకాలిక గేమ్ ఛేంజర్‌లుగా ఉంటాయి: చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కొరియన్ మోనోగ్లిజరైడ్స్.. సిట్ విచారణలో వెల్లడి

కూనో జాతీయ పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన ఆశా చిరుత

Jogi Ramesh: జోగి రమేష్‌పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు

తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments