స్టార్ డైరెక్టర్ అవకాశాన్ని కాలితో తన్నేసిన విజయ్ దేవరకొండ..?

విజయ్ దేవరకొండ ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల భారీ హిట్‌తో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. టాలీవుడ్‌లోనే కాదు మిగిలిన సినీపరిశ్రమలో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులు బాగానే పెరిగిపోయారు. అలాంటి విజయ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (21:11 IST)
విజయ్ దేవరకొండ ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల భారీ హిట్‌తో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. టాలీవుడ్‌లోనే కాదు మిగిలిన సినీపరిశ్రమలో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులు బాగానే పెరిగిపోయారు. అలాంటి విజయ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేశాడట. ఎందుకు విజయ్ అలా చేశాడు.
 
విజయ్ మణిరత్నం మూవీని రిజక్ట్ చేశాడా. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. నవాబ్ మూవీలో గోల్డెన్ ఛాన్స్ వద్దన్నాడట. శింబు ప్లేస్‌లో ముందు విజయ్‌ను అనుకున్నారట. మణిరత్నం సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ కనిపిస్తుంటుంది. సినిమా చూస్తుంటే కళాఖండాన్ని తలపిస్తుంటుంది. అందుకే సినీ ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంది. ఇప్పుడు మణిరత్నం తీస్తున్న నవాబ్ మూవీ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తమిళం, తెలుగులో నవాబ్ మూవీ విడుదల కానుంది.
 
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. ఇందులో అరవిందస్వామి, విజయ్ సేథుపతి, శింబు, జ్యోతిక లాంటి స్టార్ నటీనటులున్నారు. బాగా గ్యాప్ తీసుకుని సినిమాలు తీయడం మణిరత్నంకు అలవాటు. మొదట్లో ప్రేమ కథా చిత్రాలే తీసిన మణిరత్నం ఇప్పుడు యాక్షన్ సినిమా నవాబును తీస్తున్నారు. ఈ సినిమాతో పాత మణిరత్నం కనిపిస్తాడన్న ప్రచారం సినీపరిశ్రమలో జరుగుతోంది.
 
చాలామంది స్టార్ నటులకు మణిరత్నం సినిమాలో చేయడం ఓ కళ. స్టార్‌ అనే విషయాన్ని పక్కనబెట్టి మణిరత్నం సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటిది శింబు స్థానంలో విజయ్ దేవరకొండను సినిమాలో నటించమని మణిరత్నం చెబితే చేయనన్నాడట. ఇప్పుడు తాను యాక్షన్ సినిమాల్లో నటించే పరిస్థితులలో లేనని, అలా నటిస్తే తనపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉందని మణిరత్నంకు ముఖం మీద చెప్పేశాడట విజయ్ దేవరకొండ. దీంతో శింబును ఆ స్థానంలో ఉంచి సినిమాను తీస్తున్నాడు మణిరత్నం. ట్రైలర్ రన్ అదిరిపోవడంతో ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడట విజయ్ దేవరకొండ. మణిరత్నం సినిమాలో నటించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments