హీరో వెంకటేష్కు దర్శకడు మారుతీకి చిన్నపాటి వివాదం వుంది. దానికి కారణం లేకపోలేదు. గతంలో వెంకటేష్కు మారుతీ ఓ కథ చెప్పాడు. హోం మంత్రి లవ్లో పడితే ఏమవుతుంది? అనేది కాన్సెప్ట్. ఆ చిత్రం ప్రకటించాక.. మరో రచయిత వచ్చి.. అది తాను వెంకటేష్కు చెప్పాననీ.. స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో అది పెద్ద వివాదం అయింది. ఒకరు చెప్పిన కథను తీసుకుని మళ్లీ అదే కథతో రావడంపై వెంకటేష్.. మారుతీపై గుర్రుగా వున్నాడు. ఇది గతం. అయితే పరిణామాలు మారాయి.
తాజాగా మారుతి మరో కథను తీసుకుని... వెంకటేష్కు చెప్పినట్లు ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. కానీ దానికంటే.. అంతకుముందు మనం అనుకున్న 'రాధా' అనే కథను తీసుకురమ్మని చెప్పడంతో.... గతంలో తనది అన్న రచయితతో ఒప్పించి అదే కథను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మళ్ళీ వెంకటేష్తో రాధా చిత్రం సెట్పైకి వెళ్ళే ప్రయత్నాలు జరుపుకుంటుంది. ప్రస్తుతం మారుతీ నానితో 'భలేభలే మగాడివోయ్' రిలీజ్ హడావుడిలో వున్నాడు. ఆ చిత్రం అయ్యాక రాధాపై కాన్సన్ట్రేషన్ చేస్తాడని తెలుస్తోంది. అంతకుముందు అనుకున్నట్లు నయనతారను వెంకటేష్ పక్కన పెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.