Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... 'స్పైడర్', 'జై లవకుశ'ను దాటేసిన రజినీ 2.0 తెలుగు రైట్స్... ఎంతో తెలుసా?

రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:26 IST)
రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఈ మొత్తం మహేష్ బాబు స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కంటే ఎక్కువేనని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. 2.0 చిత్రంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రషెస్ చూసిన బయ్యర్స్ ఎంత రేటుకైనా కొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. చిత్రంలో దమ్ముందనే టాక్ వినిపిస్తోంది. 
 
తెలుగులోనే 75 కోట్లకు అమ్ముడయితే ఇక హిందీ, తమిళం ఇతర భాషల్లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో మరి. పైగా రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో చిత్రం వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఐతే అంతకుముందు వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments