కోవిడ్ వ‌ల్ల ప్ర‌భాస్ సినిమా టెక్నిక‌ల్‌లో మార్పు

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:51 IST)
aadi purush
కోవిడ్ ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లోనూ కొత్త పోక‌డ‌లను ద‌ర్శ‌క నిర్మాతలు వెతుక్కుంటున్నారు. అందులోనూ వంద‌ల కోట్లు పెట్టి తీస్తున్న ప్ర‌భాస్ సినిమా `ఆదిపురుష్‌`కు అడుగ‌డుగునా కొన్ని అడ్డంకులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. షూటింగ్‌లో వుండ‌గా సెట్ కాలిపోవ‌డం కూడా అప్ప‌ట్లో జ‌రిగింది.
 
పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తుంది. రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నారు.
 
కాగా, ఈ సినిమా టెక్నాల‌జీ కొద్దిగా మార్చ‌నున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఓంరౌత్ తన చిత్రం “తనాజీ” తరహాలోనే 3డి టెక్నాలిజీనే ఈ సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. దీనివ‌ల్ల ఔట్‌పుట్ బాగా వ‌స్తుందని, పెట్టిన పెట్టుబ‌డికి గిట్టుబాటు అవుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనివ‌ల్ల విజువ‌ల్‌ప‌రంగా నేత్రానందంగా వుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా కోవిడ్ సినిమాలోనూ మార్పు తెచ్చింద‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా ఒక ఆస్తి-భారం కాదు: చంద్రబాబు మూడు, నాలుగు సంతానికి ప్రోత్సాహాకాలు ఎందుకంటే?

ఈ కట్టె కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్ : నటుడు తనీష్ ఎమోషనల్ ట్వీట్

Put Chutney యూ ట్యూబర్ నుంచి విజయ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా రాజ్ మోహన్

వట సావిత్ర వ్రతం నాడు దీపాలు వెలిగిస్తుండగా మర్రిచెట్టుకు అంటుకున్న నిప్పు, వీడియో

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments