Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహాతో అదరగొట్టనున్న తమన్నా, పారితోషికం ఎంతో తెలిస్తే అదిరిపోతారు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (17:23 IST)
ఆహా.. అంటూ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ క్రియేట్ చేయడం తెలిసిందే. దీనిని సక్సెస్ చేయడం కోసం అల్లు అరవింద్ టాప్ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. క్రిష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి... ఇలా సక్సస్‌ఫుల్ డైరెక్టర్స్‌కి ఆహాను ఓహో అనిపించే బాధ్యతను అప్పగించారు.
 
ట్రెండ్‌కి తగ్గట్టుగా వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్స్ రూపొందించేందుకు స్ర్కిప్ట్‌లు సెలెక్ట్ చేయడం... వీరి బాధ్యత. ప్రస్తుతం కొన్ని స్ర్కిప్టులు ఫైనల్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే.. కరోనా కారణంగా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదిలా ఉంటే... ఆహా కోసం అల్లు అరవింద్ మిల్కీ బ్యూటీ తమన్నాను రంగంలోకి దింపారని తెలిసింది.
తమన్నాతో టాక్ షో చేయించి.. ఆహాకు మరింత ఆదరణ లభించేలా చేయాలనుకుంటున్నారు. అయితే... తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అనేది ఆసక్తిగా మారింది. తెలుగును స్పష్టంగా మాట్లాడే తమన్నా ఈ షోతో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఒక్కో ఎపిసోడ్‌కు తమన్నాకు 8 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని టాక్. తమన్నాతో టాక్ షో చేయించాలనే ప్లాన్ బాగానే ఉంది. మరి.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యి ఆహాకు ఆశించిన ఆదరణ లభిస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments