Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సురభి: కళ్యాణ్ రామ్‌తో రొమాన్స్‌కు రెడీ!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (14:53 IST)
బీరువా చిత్రం‌తో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఢిల్లీ సుందరి సురభిని అదృష్టం వరించింది. అసలు విషయానికొస్తే పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాలో కథానాయికగా సురభిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజా మూవీలో శర్వానంద్‌తో ఆడిపాడిన సురభికి.. ఆ మూవీ  హిట్ కావడంతో మంచి పేరే వచ్చింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'రోగ్' సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత పూరీ కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని సినీవర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి రీమిక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.
 
కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడట. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించి హీరోగా నటించనున్న సినిమాలో ఈ నందమూరి హీరోకి జంటగా సురభి దాదాపు కన్ఫాం అయినట్లే అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. అదే నిజమైతే సురభి మంచి ఛాన్స్ కొట్టేసినట్టే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments