Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బీరువా" సురభికి మరో ఛాన్స్...

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (11:27 IST)
'బీరువా' అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి సురభి. ఈ చిత్రంలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. 2013లో ఓ తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు 'బీరువా' అనే చిత్రం ద్వారా పరిచయమైంది. సురభికి మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. 
 
టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలను బాగానే ఆకట్టుకుంది. దాంతో ఇక్కడ 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఎటాక్', 'జెంటిల్‌మాన్' వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో కూడా సురభికి మంచి గుర్తింపు దక్కింది. కానీ వరసగా అవకాశాలు మాత్రం దక్కించుకోవడంలో బాగా వెనకబడింది. 2019లో 'ఓటర్ అన్న' సినిమా తర్వాత రీసెంట్‌గా 'శశి' అన్న సినిమాలో నటించింది.
 
ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. సురభి కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. 
 
'శశి' సినిమాలో ఉన్న 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మళ్ళీ అందరి దృష్టి సురభి మీద పడిందని తెలుస్తోంది. ఈ సినిమా మీద సురభి చాలా నమ్మకాలు పెట్టుకోగా హిట్ టాక్ వస్తే మాత్రం మళ్ళీ యంగ్ హీరోల సినిమాలలో వరసగా అవకాశాలు దక్కించుకుంటుందని నమ్మకంగా ఉందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments