Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'లూసిఫర్' చిత్రంలో అలనాటి హీరోయిన్ కీలక పాత్ర?

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (14:39 IST)
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసీఫర్' చిత్రాన్ని తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నారు. ఇందులో పలువురు కీలక నటీనటులు నటిస్తున్నారు. అయితే, తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ సుహాసిని ఓ కీలక పాత్రలో పోషించనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ మంచి విజయాన్ని సాధించింది. దీంతో తన తండ్రితో దీనిని రీమేక్ చేయడానికి హీరో రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మలయాళం ఒరిజినల్ లో మంజూ వారియర్ పోషించిన కీలక పాత్రకు టాలెంటెడ్ నటిని ఎంపిక చేయాలని భావించి, సుహాసినిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టుకి మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు.
 
నిజానికి 80-90 కాలంలో చిరంజీవి - సుహాసినిలు కలిసి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ నటించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా. అయితే, ప్రస్తుతం లూసిఫర్ చిత్రంలోని పాత్ర డిమాండ్ మేరకు సుహాసిని ఎంపిక చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments