కమల్ హాసన్ కూతురు, కథానాయిక శ్రుతిహాసన్పై అనేక రకాలుగా మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో నటుడు సిద్ధార్థ్తో శ్రుతి డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో కమల్ కుమార్తె తాజాగా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనాతో డేటింగ్ చేసినట్లు సమాచారం. సురేష్ రైనా కూడా గతంలో మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణతో డేటింగ్ చేసినట్లు వార్తలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సురేష్ రైనా, శ్రుతిహాసన్ల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు పత్రికలు కథనాలు ప్రచురించాయి. వాటి ప్రకారం వారిద్దరూ సహజీనవంలో మునిగి ఉన్నారని తెలుస్తోంది.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఇటీవల నిర్వహించిన ఓ పార్టీలోనూ శ్రుతి పాల్గొన్నదట. సురేష్ రైనా ఇటీవల మంచి పనితీరును కనబరుస్తున్న విషయం తెలిసిందే. దీనికి శ్రుతి ఇస్తున్న జోషే కారణమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, వీరు వీలున్నప్పుడల్లా కలుసుకుంటున్నారని, తమ అనుంబంధం విషయంలో సీరియస్గా ఉన్నారని సమాచారం.