టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "బాహుబలి". ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకువచ్చింది. తొలుత ఈ సినిమా బడ్జెట్ 100కోట్ల నుంచి 120 కోట్లుగా భావించారు. అయితే ఇపుడు ఈ సినిమా బడ్జెట్ దాదాపు 175కోట్లకు చేరనుందని సమాచారం.
రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భారీ యుద్ధసన్నివేశాలు, యాక్షన్ సీన్స్ కోసం ఎక్కువుగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా ఇంత బడ్జెట్తో తెరకెక్కలేదు. రజనీకాంత్ నటించిన రోబో 200కోట్ల తర్వాత ''బాహుబలి" 175కోట్లుతో తెరకెక్కుతోంది. వచ్చే సంవత్సరం విడుదల కానున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి.