Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లుక్ ఆగస్టు 15న వచ్చేస్తుందట.. ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశాడట..

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు

Webdunia
శనివారం, 29 జులై 2017 (16:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌‍తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా పాల్గొనలేదు. అయితే ఆయన లుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
తొలుత ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్‌, టీజర్‌ను వదిలారు. ఆ తర్వాత ఎలాంటి లుక్స్ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి2 తర్వాత రాజమౌళి సినిమా ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రభాస్‌ కోసం పక్కా కమర్షియల్‌ కథను రెడీ చేశారట రాజమౌళి. అయితే ప్రభాస్, రాజమౌళి రేంజ్‌ను మరింత పెంచే విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments