Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ నెక్ట్స్ టార్గెట్ ఉదయ్ కిరణ్ బయోపిక్, కారణం అదే..!

Webdunia
శనివారం, 25 జులై 2020 (13:12 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం పవర్ స్టార్. ఈ మూవీ ట్రైలర్‍కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఇక సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. అయితే... వర్మ ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు ఎవరూ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. మెగా హీరోలు ఎవరూ స్పందించలేదు.
 
అభిమానులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో పవర్ స్టార్ పైన క్యూరియాసిటీ అంతగా లేదనిపించింది. అయితే... విడుదల తేదీ దగ్గరపడిన రెండు రోజులకు వర్మ ఆఫీస్ పైన పవన్ అభిమానులు దాడి చేయడంతో పవర్ స్టార్ వార్తల్లో నిలిచింది. వివాదస్పదం అయ్యింది.
 
 వర్మకు కావాల్సింది ఇదే. పబ్లిసిటీ వచ్చేసింది. ఈ సినిమాకి కౌంటర్‌గా పరాన్నజీవి అంటూ మరో సినిమా వస్తుండటం తదితర కారణాలతో వర్మ ఆశించిన బజ్ వచ్చేసింది.
 
ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమా తీయనున్నాడు అంటే... ఉదయ్ కిరణ్ బయోపిక్ అని తెలిసింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఈ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ బయోపిక్ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తేజ కాదు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రానుందని టాక్ వచ్చింది. ఈ రెండు జరగలేదు.
 
ఇప్పుడు వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయాలనుకున్నాడట. కారణం ఏంటంటే... ఉదయ్ కిరణ్‌‌కి చిరు డాటర్‌తో నిశ్చితార్ధం కావడం... ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వడం.. ఆ తర్వాత చిరు వలనే అవకాశాలు లేకుండాపోయాయి అని ప్రచారం జరిగింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తే... చిరు ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుందనే వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments