Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 'ప్రజల మనిషి'... ఆయన కోసం కథ రాస్తున్నా... రాజమౌళి తండ్రి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నటుడిగా కంటే కూడా వ్యక్తిగా తనకు ఎంతో ఇష్టమని సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు... పవన్ కళ్యాణ్ తను అనుకున్న మార్గాన్ని తప్పకుండా మ

Webdunia
సోమవారం, 29 మే 2017 (18:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నటుడిగా కంటే కూడా వ్యక్తిగా తనకు ఎంతో ఇష్టమని సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు... పవన్ కళ్యాణ్ తను అనుకున్న మార్గాన్ని తప్పకుండా ముందుకు సాగుతారనీ, ఆ మార్గంలో ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొనే తత్వం చూస్తే ముచ్చటేస్తుందని అభిప్రాయపడ్డారు. 
 
అలాంటి వ్యక్తి తను అనుకున్నది సాధించేందుకు ఎంతదూరమైనా వెళతారని అన్నారు. అలాంటి ప్రజల మనిషి కోసం ఓ కథను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. మరి ఈ కథ పవన్ కళ్యాణ్ కు వినిపిస్తే, ఆ కథ నచ్చితే దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ప్రశ్న. 
 
కాగా విజయేంద్ర ప్రసాద్ కథ మామూలుగా వుండదు, అది కూడా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో వున్న ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని కథ రాసే అవకాశం వుంటుంది. అదే జరిగితే, ఆ కథనే తెరకు ఎక్కిస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో మైలేజి పెరగడం ఖాయం. విజయేంద్ర ప్రసాద్ అన్నట్లే పవన్ కళ్యాణ్ ఎక్కడికో వెళ్లడమూ ఖాయమే. మరి ఇది 2019 లోపే జరుగుతుందో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments