Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ అప్‌డేట్స్ ఏంటంటే...

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (16:49 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
నిజానికి ఈ చిత్రం షూటింగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఆసుపత్రి సెట్స్ వేశారు. వచ్చే నెల ద్వితీయార్థం నుంచి షూటింగు నిర్వహించాలని షెడ్యూల్ కూడా వేసుకున్నారు.
 
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూరప్‌లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని చిత్రం యూనిట్ భావిస్తోందట. దీంతో మొదట్లో అనుకున్నట్టుగానే ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. 
 
ఇందుకోసం చార్టెడ్ ఫ్లయిట్‌ను బుక్ చేసుకుని యూనిట్‌ని అక్కడికి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముందుగా ఇటలీలో షూటింగ్ చేస్తారా? లేక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్‌లో చేస్తారా? అన్న విషయంలో త్వరలో స్పష్టత వస్తుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments