Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - రానా కలిసి మరో సినిమా చేయనున్నారా? డైరెక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:28 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. బాహుబలి తర్వాత ఓ వైపు ప్రభాస్, మరోవైపు రానా ఇద్దరూ వేరే సినిమాలతో బిజీ అయ్యారు.
 
ఈ ఇద్దరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ... కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ - రానా కలిసి సినిమా చేయనున్నారు అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇంతకీ విషయం ఏంటంటే... ప్రభాస్‌తో దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా తీసారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది.
 
అయితే... మిస్టర్ పర్ఫెక్ట్ తీసిన దర్శకుడు దశరథ్ ఇటీవల ప్రభాస్‌కి ఓ కథ చెప్పారని తెలిసింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు రానా అయితే కరెక్ట్‌గా సరిపోతాడని.. రానాని కాంటాక్ట్ చేసి కథ చెప్పాడని టాక్. ఈ కథ విని రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
 
 దీంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments