Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీబాయ్ రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే?

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:40 IST)
కేజీఎఫ్ హీరో యశ్ తాజా సినిమాలో పూజా హెగ్డే నటించనుందని టాక్. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్‌గా చేయనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని, యశ్ సినిమా కోసం ఆమెను ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాల నుంచి క్లారిటీ వస్తోంది. 
 
ప్రస్తుతం పూజా హైదరాబాద్‌లో జరుగుతోన్న కభీ ఈద్ కభీ దివాలి సినిమా షూట్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకుడు.
 
ఇదిలా వుండగా.. కేజీఎఫ్2 ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేజీఎఫ్3కి మేకర్స్ శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సినిమాలోనే మరో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో, ఆడియన్స్ నుంచి దానికి డిమాండ్ వచ్చిపడింది.
 
ఈ క్రమంలోనే కేజీఎఫ్3 ఉంటుందని, మేకర్స్ స్పష్టం చేశారు. అయితే, ఎప్పట్నుంచి ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 
 
ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తోనూ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాబట్టి, కేజీఎఫ్3 సెట్స్ మీదకి వెళ్లేందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments