Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ నిజమేనా..?

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (17:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ మూవీ సెట్స్ పైన ఉండగానే... క్రిష్ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం చేయడానికి ఓకే చెప్పడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. పిరియాడిక్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 
 
భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆల్రెడీ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ ప్లాన్ చేసారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. పవన్‌తో చేస్తున్న ఈ సినిమాతో భారీ విజయం సాధించాలని క్రిష్ ఎంతో పట్టుదలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పారు. పవన్ - హరీష్ శంకర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. వేణు శ్రీరామ్‌తో వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్‌లతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. ఈ మూడు సినిమాలే కాకుండా మరో ఇద్దరు దర్శకులకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 
 
ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే.. మరొకరు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. 
 
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా తొలిప్రేమ. ఈ సినిమా ద్వారా కరుణాకరన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుని సంచలన విజయం సాధించింది. ప్రేమకథా చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే తొలిప్రేమ ఇప్పటి తరాన్ని కూడా విశేషంగా అరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రానుందని వార్తలు వస్తున్నాయి. 
 
తాజా సమాచారం ప్ర‌కారం… ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తొలిప్రేమ‌ చిత్రాన్ని కొన‌సాగించే దిశ‌గా స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారని.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జరిపినట్టు తెలిసింది. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌టంతో ప‌వ‌న్ కూడా ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సీక్వెల్ పైన ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments