Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు హీరోయిన్ల సరసన రీ-ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. కథేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (18:19 IST)
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమాల విషయాన్ని ఆయన పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎపిలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో పర్యటనలను కొనసాగిస్తున్నారు.
 
అయితే పవన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందీలో భారీ విజయాన్ని సాధించిన పింక్ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారట. శ్రీదేవి భర్త బోనీకపూర్, ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌లు కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయట.
 
అయితే మొదట్లో పింక్ సినిమాలో తాను నటించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినా ఆ తరువాత తన నిర్ణయాన్ని మాత్రం మార్చేసుకున్నారట. జనవరి 15వ తేదీ పైన ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్లు ఆ సినిమా యూనిట్ సభ్యులే బహిరంగంగా చెప్పేస్తున్నారు. 
 
ఇక ఆ సినిమాలో నివేదా థామస్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించిన సమంత మరోసారి ఆయనతో కలిసి నటించబోతోంది. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనానే ఉందట. శ్రీరామ్ సినిమాకు దర్సకత్వం వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments