Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ మూవీలో నివేదా థామస్.. ఇది నిజమేనా? (video)

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (12:07 IST)
జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఆ తర్వాత నిన్నుకోరి సినిమాతో మరో విజయం సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది నివేదా థామస్.
 
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది. యూత్‌ని బాగా ఆకట్టుకుంది కానీ... ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 118, బ్రోచేవేరేవరురా, దర్బార్ సినిమాలతో మెప్పించినా.. స్టార్ హీరోల సినిమాలు అనుకున్నంతగా ఛాన్స్‌లు రాలేదు.
 
ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ మహేష్‌ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో సర్కారు వారి పాట అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇందులో నివేదా థామస్ కూడా నటించనున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని... ఈ సినిమాతో నివేదాకు మరింత పేరు రావడం ఖాయం అంటున్నారు. ఇదే కనుక నిజమైతే... నివేదా థామస్‌కు బంపర్ ఆఫరే.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments