Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సమంతను వద్దని చెప్పిన చైతూ..? ఎందుకు..?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (19:02 IST)
''మజిలీ'' సినిమాతో మంచి విజయం అందుకొని భారీ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నాగచైతన్య సరసన నటిస్తుంది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మనం వంటి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చైతూ ఒక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. 
 
అలాగే ఈ సినిమాకు 'థాంక్యూ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మనం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ రేంజి హిట్ మళ్లీ కొట్టలేదు విక్రమ్. నిజానికి హిట్ అనేదే ఆయనకు కరువైందని చెప్పాలి. కాబట్టి ఈ 'థాంక్యూ' సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది.
 
దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరినేది ఇంకా ఫైనల్ కాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కానీ కాదని తేలింది. అయితే తాజాగా సమంత అయితే బాగుంటుందని మేకర్స్ సూచిస్తే.. నాగచైతన్య వెంటనే వద్దు అని చెప్పేసాడట.
 
ఎందుకంటే సామ్ - చైతూలు కలిసి రీసెంట్‌గా మజిలీ చేశారు. మళ్లీ అదే కాంబో అయితే బాగోదని చైతూ వేరే హీరోయిన్ని చూడమని చెప్పినట్లు సమాచారం. మరి ఈ సినిమాకు హీరోయిన్ ఎవరో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments