Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. అదంతా ఉత్తుత్తి వార్తే... క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (12:16 IST)
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేరంగాసాగుతోంది. ఆచార్య అనే వర్కింట్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ సాగుతుంటే, ఇందులో చిరంజీవి స్నేహితుడు, సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారనే వార్తల హల్చచల్ చేసింది. వినోదంతో పాటు సందేశంతో కూడిన ఈ మూవీ కథలో మోహన్ బాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.
 
ఈ ప్రచారంపై మూవీ యూనిట్ స్పందించింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టంచేసింది. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని వివరణ ఇచ్చింది. గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ. అయితే, చిత్ర యూనిట్ ఇచ్చిన క్లారిటీతో అది నిరాశే అయింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments