Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్‌కి జోడీగా 'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు... మణిరత్నం దర్శకత్వంలో....

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:26 IST)
తమిళంలో పేరుగాంచిన రైటర్ కల్కి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా, విజయ్, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రయత్నించినప్పటికీ వర్క్అవుట్ కాలేదు.

తాజాగా ఈ సినిమా కోసం జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబుతో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అరుల్ మోళి వర్మన్ పాత్రలో జయం రవి, ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్‌ను నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని కూడా నందిని పాత్ర కోసం ఎంపిక చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
 
ఈ నవలలో నందినిది చాలా కన్నింగ్ పాత్ర. పెరియా పళువెటరాయర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది. పెరియా పళువెటరాయర్‌ పాత్ర కోసం మోహన్ బాబును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి ప్రకటించే అవకాశముంది. 
 
వరుస ప్లాపులతో తడబడిన మణిరత్నం గతేడాది తమిళంలో చేసిన ‘చిక్క చివంత వానమ్' సినిమా మంచి విజయం సాధించింది. ‘పొన్నియిన్ సెల్వన్' నవల రాయడానికి రచయితకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. మరి ఈ సినిమా పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments