Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్‌కి జోడీగా 'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు... మణిరత్నం దర్శకత్వంలో....

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:26 IST)
తమిళంలో పేరుగాంచిన రైటర్ కల్కి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా, విజయ్, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రయత్నించినప్పటికీ వర్క్అవుట్ కాలేదు.

తాజాగా ఈ సినిమా కోసం జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబుతో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అరుల్ మోళి వర్మన్ పాత్రలో జయం రవి, ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్‌ను నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని కూడా నందిని పాత్ర కోసం ఎంపిక చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
 
ఈ నవలలో నందినిది చాలా కన్నింగ్ పాత్ర. పెరియా పళువెటరాయర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది. పెరియా పళువెటరాయర్‌ పాత్ర కోసం మోహన్ బాబును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి ప్రకటించే అవకాశముంది. 
 
వరుస ప్లాపులతో తడబడిన మణిరత్నం గతేడాది తమిళంలో చేసిన ‘చిక్క చివంత వానమ్' సినిమా మంచి విజయం సాధించింది. ‘పొన్నియిన్ సెల్వన్' నవల రాయడానికి రచయితకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. మరి ఈ సినిమా పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు

పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments