Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్న ప్రిన్స్, ఎలా?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (20:52 IST)
కమర్షియల్ ప్రకటనల విషయంలో సినీ నటుడు మహేష్ బాబు జోరు కొనసాగిస్తున్నారు. డైనమిక్ హీరో మహేష్ బాబుతో ప్రమోట్ చేయించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఫలితంగా ప్రకటన రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదంటున్నారు ప్రిన్స్ మహేష్. 

 
అయితే మహేష్ అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు కంపెనీలు కూడా తగ్గేదిలేదంటున్నాయట. మహేష్‌ బాబు ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో ఒక్కోదానికి ఒక్కోలా పారితోషికం తీసుకుంటూ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటున్నాడట.

 
తాజాగా ఓ శీతలపానీయం యాడ్ కోసం భారీగా పారితోషికం అందుకున్నాడట. ఈ యాడ్‌ను దుబాయ్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతంలో షూట్ చేశారట. హిందీలో ఈ యాడ్‌ను హృతిక్ రోషన్ చేశారట. తెలుగులో యేడాది పాటు ఈ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేయడానికి మహేష్ ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

 
గత యేడాది కూడా ఈ బ్రాండ్‌ను మహేష్ ప్రమోట్ చేశారట. అయితే అప్పట్లో 7 కోట్లు తీసుకున్న మహేష్ ఈసారి అదనంగా మరో ఐదుకోట్లు ఎక్కువగా తీసుకున్నారట. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ కంపెనీకి సంబంధించిన బ్రాండ్‌ను మహేష్  ప్రమోట్ చేయాల్సి ఉంటుందట.
 
ఈ మొత్తానికి భారీగా రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రమోషన్స్ మరోవైపు సినిమాల్లో మహేష్ బిజీబిజీగా ఉన్నారు. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు మహేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments