Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అలా చెప్పలేదు.. తప్పుడు వార్తలు రాయొద్దు.. కైరా అద్వానీ

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:10 IST)
పారితోషికం తక్కువగా ఇస్తుండటం వల్లే తెలుగు చిత్రాల్లో నటించడం లేదంటూ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కైరా అద్వానీ స్పందించారు. తాను ఎన్నడు కూడా అలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. పైగా, సరైన కథలు లేకే తాను తెలుగులో నటించడం లేదని తెలిపారు.
 
"భరత్ అనే నేను" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కైరా అద్వానీ. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కైరా అద్వాని, ఆ తర్వాత 'వినయ విధేయరామ' చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి కైరా తెలుగు సినిమాలు చేయడం లేదు.
 
అదేసమయంలో తెలుగు నుంచి ఆఫర్స్ వెళితే భారీగా పారితోషికం అడుగుతోందనే వార్తలు వచ్చాయి. తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై కైరా స్పందిస్తూ, "తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ.. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు" అని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments