Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అలా చెప్పలేదు.. తప్పుడు వార్తలు రాయొద్దు.. కైరా అద్వానీ

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:10 IST)
పారితోషికం తక్కువగా ఇస్తుండటం వల్లే తెలుగు చిత్రాల్లో నటించడం లేదంటూ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కైరా అద్వానీ స్పందించారు. తాను ఎన్నడు కూడా అలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. పైగా, సరైన కథలు లేకే తాను తెలుగులో నటించడం లేదని తెలిపారు.
 
"భరత్ అనే నేను" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కైరా అద్వానీ. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కైరా అద్వాని, ఆ తర్వాత 'వినయ విధేయరామ' చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి కైరా తెలుగు సినిమాలు చేయడం లేదు.
 
అదేసమయంలో తెలుగు నుంచి ఆఫర్స్ వెళితే భారీగా పారితోషికం అడుగుతోందనే వార్తలు వచ్చాయి. తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై కైరా స్పందిస్తూ, "తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ.. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు" అని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Meera Jasmine: నటుడు షైన్ టామ్ చాకో కుటుంబానికి నటి మీరా జాస్మిన్ సంతాపం

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments