Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'రాముడు' సరసన 'సీత'గా బాలీవుడ్ నటి ఫిక్స్?!

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (22:17 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న మరో భారీ ప్రాజెక్టు ఆదిపురుష్. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ ప్రాజెక్టును బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పట్టాలెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నారు. దీంతో ప్రభాస్ సరసన సీతగా ఎవరు కనిపిస్తారన్న చర్చ సోషల్ మీడియా వేదికగా సాగింది. ఈ పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారనే వార్తలు వినొచ్చాయి. 
 
అయితే, అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ భామ కియరా అద్వానీ కోసం ఈ చిత్ర నిర్మాతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు, ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు వినికిడి. ఆమె ఎంపిక దాదాపు పూర్తయిందని కూడా కొందరు అంటున్నారు.
 
ఇదిలావుంచితే, ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఏకధాటిగా రెండు నెలల చిత్రీకరణతో పూర్తి చేస్తామని దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. అయితే, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని, ఇందులో వాటి ప్రాధాన్యత ఎక్కువని ఆయన తెలిపారు. కాగా, ఇందులో విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు సయీఫ్ అలీ ఖాన్ పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments