Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్, త్రివిక్రమ్‌లకు కీర్తి క్లాస్... అలా ఒప్పుకోకపోతే పోతానంటోందట...

తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మలయాళ భామల హవా పెరిగిపోయింది. నయనతార, సమంత, నిత్యామీనన్, సాయిపల్లవి ఇలా చాలామంది హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీని ఏలుతున్నారు. కీర్తి సురేష్‌ కూడా మళయాళం నుంచి వచ్చి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు స

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:51 IST)
తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మలయాళ భామల హవా పెరిగిపోయింది. నయనతార, సమంత, నిత్యామీనన్, సాయిపల్లవి ఇలా చాలామంది హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీని ఏలుతున్నారు. కీర్తి సురేష్‌ కూడా మళయాళం నుంచి వచ్చి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించేసుకుంది. నేను శైలజ సినిమాలో రామ్‌తో కలిసి నటించిన కీర్తి సురేష్‌ ఆ తరువాత కొన్ని సినిమాల్లో చేసి అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. 
 
కీర్తి సురేష్‌ పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అతి తక్కువ కాలంలో కమర్షియల్ యాడ్‌లలో నటించిన ఈ సుందరి అగ్రహీరోలతో కలిసి పనిచేయడం అటు తెలుగు, ఇటు తమిళ బాషల్లో కీర్తి సురేష్‌ ముందుకు వెళుతుండడం సినీవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 
 
అవకాశాలు లేకపోయినా ఫర్వాలేదు కానీ కురచ దుస్తులు నటించి సినిమాలు చేయడం కీర్తి సురేష్‌కు ముందు నుంచి అస్సలు ఇష్టం లేదు. దీంతోపాటు మరికొన్ని షరతులను డైరెక్టర్లకు పెట్టిందట కీర్తి సురేష్‌. అదే ముసలి హీరోలతో అస్సలు నటించనని. దీంతో 15 సినిమాల అవకాశాలను కీర్తి పోగొట్టుకుందట. ఎన్ని సినిమాలు పోయినా ఫర్వాలేదు నా పాలసీ నాదే అంటోంది ఈ మలయాళ భామ.
 
ఒక్క సినిమాకు 2.5 కోట్ల రెమ్యునరేషన్ మాత్రం తీసుకుంటోందట. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గని కీర్తి సురేష్‌ పరిధి మాత్రం దాటి నటించనని చెబుతోందట. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో కురచ దుస్తులు ధరించాల్సి వస్తే ఆ సినిమా షూటింగ్ నుంచి బయటకు వచ్చేస్తానని డైరెక్టర్ త్రివిక్రమ్‌కు తేల్చి చెప్పేసిందట. త్రివిక్రమ్ రాసుకున్న కథకు సరిగ్గా సరిపోయే అమ్మాయి కీర్తి సురేష్‌ కావడంతో ఎన్ని కండిషన్లు పెట్టినా త్రివిక్రమ్ ఒకే అనేస్తున్నారట. సెట్స్ మీదకు పవన్ సినిమా వెళ్ళకముందే కీర్తి పెట్టిన కండిషన్లు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments